సిరికొండ, జూన్ 17, (మన వార్త ప్రతినిధి):
సిరికొండ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బందెల ధర్మపురి తన ఇంటికి వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం "సిరికొండ సమస్యలు" వాట్సాప్ గ్రూపులో వివరాలు పోస్టు చేసినట్లు తెలిపారు.
అనంతరం గ్రామ సర్పంచ్కు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని, దీంతో 5వ.వార్డు మెంబర్ కనుగందుల మురళిని సంప్రదించానని చెప్పారు. అయితే సమస్య పరిష్కారంపై స్పందించకుండా "గ్రూపులో ఎందుకు మెసేజ్ పెట్టావు, అలా పెట్టితే సమస్య పరిష్కారం అవుతుందా?" అంటూ తనతో మాట్లాడినట్లు ఆరోపించారు.గతంలో కూడా ఇలాంటి సమస్యలను గ్రూపులో ప్రస్తావించడంతో పరిష్కారం లభించిందని తాను చెప్పినా, "నాకు వచ్చి చెప్పావా?" అంటూ ప్రశ్నించారని ధర్మపురి తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన సందర్భాల్లో కూడా సంబంధిత వ్యక్తి అందుబాటులో లేరని పేర్కొన్నారు.ఇటీవల సర్పంచ్ స్వయంగా వచ్చి సమస్య గురించి అడిగారని, నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన గేట్ వాల్వ్ సరైన ప్రదేశంలో లేకపోవడంతో తమ ఇంటికి పూర్తిగా నీరు రావడం లేదని వివరించారు. ఈ విషయాన్ని మళ్లీ తెలియజేయగా, "సర్పంచ్కు ఫోన్ చేయి, నాకెందుకు చేశావు" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు.తాను గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తానని, అక్కడ మాట్లాడుకుందామని చెప్పగా, "నేను హైదరాబాద్లో ఉన్నాను" అని చెప్పారని, అనంతరం తనను అవమానించేలా మాట్లాడారని ధర్మపురి వాపోయారు.ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రజల సమస్యలను గౌరవంగా వినాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Telangana
నీటి సమస్యను ప్రశ్నించినందుకు వేధింపులా..? సిరికొండలో ఎస్సీ కాలనీ వాసి ఆవేదన..
Quick Summary:
సిరికొండ, వార్త